Mega Powerstar: మెగాస్టార్, ప‌వ‌ర్‌స్టార్ క‌లిపితే నా బావ: మెగా హీరో సాయితేజ్

Mega Powerstar: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఒక్క‌రోజు ముందు నిన్న హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళా వేదిక‌లో రాంచ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సెలెబ్రేష‌న్స్ జ‌రిగాయి. ఈ వేడుక‌లో మెగా హీరో సాయితేజ్‌, ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, తేజా సజ్జా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సాయితేజ్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ లను క‌లిపితేనే నా బావ‌ మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు సాయితేజ్‌. అలాగే మావ‌య్య చిరంజీవిగారి త‌ర్వాత అంత‌టి ప్రేమ‌ను Mega Powerstar చెర్రీకి ఇస్తున్నార‌ని.. ఇదంతా అభిమానుల ప్రేమ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని ఇంత ప్రేమ కురిపిస్తున్న ఫ్యాన్స్‌కు ధ‌న్య‌వాదాలు అని అన్నారు.

Sai tej

సాయితేజ్ ఓ క‌థ చెప్పి మెగాభిమానుల్లో గూస్‌బంప్స్ వ‌చ్చేలా చేశాడు.. పిల్ల‌లంద‌రికీ మామిడి చెట్టు చూపించిన ఓ మాస్ట‌ర్‌.. ఎవ‌రు ముందుగా అక్క‌డికి ప‌రిగెడితే వారికే ఆ మామిడి కాయ‌ల‌న్నీ ఇస్తాన‌ని చెప్పార‌ట‌.. కానీ ఆ పిల్ల‌లు మాత్రం ఒక‌రి చేయి మ‌రొక‌రు ప‌ట్టుకుని క‌లిసి వెళ్లార‌ట‌.. ఆ పిల్ల‌లే మెగా వార‌సురాలు అని తెలిపారు సాయితేజ్‌. మెగా ఫ్యామిలీని కొంద‌రు టార్గెట్ చేస్తున్నార‌ని.. వాళ్లు ఎవ‌రో మీక్కూడా తెలుస‌ని అన్నారు. అయితే వాళ్లు ఎంత ద్వేషించినా తాము మాత్రం అంద‌రినీ ప్రేమిస్తూనే ఉంటామ‌ని సాయితేజ్ పేర్కొన్నాడు.‌‌‌