సాయి ధరమ్ తేజ్ సినిమాకు రూ.25కోట్ల ఆఫర్?

బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ కొన్ని చిన్న సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆలస్యం అయితే సినిమాలపై ఉన్న క్రేజ్ తగ్గుతుందని షూటింగ్ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలను ఓటీటీ సంస్థలకు అమ్మేస్తున్నారు. ఇక త్వరలోనే కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలో కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అందులో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా కూడా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఈ మెగా మేనల్లుడు ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. సమ్మర్ మొదట్లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇటీవల ఒక ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కుల కోసం రూ.25కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఏ విధంగా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. వీలైనంత వరకు నిర్మాతలు థియేటర్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే రిలీజ్ తరువాత కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియదు. దీంతో రూ.25కోట్ల ఆఫర్ కి ఒప్పుకుంటే సేఫ్ జోన్ లో పడవచ్చు. మరి వారు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి.