Kollywood: శింబు న‌టించిన రివైండ్ చిత్ర టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన మాస్ మ‌హారాజ్..

Kollywood: కోలీవుడ్ స్టార్ హీరో శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా… క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ కామాచి నిర్మిస్తున్న త‌మిళ చిత్రం మానాడు. తెలుగులో రీవైండ్ గా వ‌స్తుండ‌గా.. ఈ చిత్రాన్ని 125 కోట్ల భారీ బడ్జెట్ తో.. త‌మిళ్‌తో పాటు హిందీ తెలుగు కన్నడ మలయాళ భాషల్లో డ‌బ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన‌ టీజర్ ఈ రోజు మధ్యాహ్నం 2.34 నిమిషాలకు మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేశారు.

shimbu

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రీవైండ్ Kollywood చిత్ర‌ కథానాయకుడు శింబు పుట్టినరోజు సందర్భంగా.. తను నటిస్తున్న ముల్టీ లింగ్యుల్ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు వెర్షన్ టీజర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని రవితేజ అన్నారు. హీరో శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. ఇక ఈ చిత్రంలో సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. Kollywood ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చుతున్నారు. ఈ క్ర‌మంలో రివైండ్ టీజర్… తాజాగా ‘క్రాక్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రం హిందీ టీజర్ ప్రముఖ దర్శకులు అనురాగ్ కశ్యప్, Kollywood తమిళ్ టీజర్ ఏ.ఆర్.రెహమాన్, కన్నడ టీజర్ కిచ్చా సుదీప్ రిలీజ్ చేయడం విశేషం.