ఆల్ టైం ఇండియాస్ బిగ్గెస్ట్ డిసాస్టర్

సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో 550 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సెన్సేషనల్ మూవీ 2.0. 2018లో మోస్ట్ వాంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా మంచి వసూళ్లు రాబట్టి సౌత్ లో మరియు కొన్ని నార్త్ ఏరియాల్లో హిట్ అనిపించుకున్నా ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యపరిచే రేంజ్ రికార్డులని మాత్రం సృష్టించలేకపోయింది. ఇదే సినిమాని దాదాపు ఏడాది తర్వాత చిత్ర యూనిట్ 2.0ని చైనాలో భారీగా ఆశలతో రిలీజ్ చేశారు.

ఏ ఇండియన్ సినిమాకి సాధ్యం కానీ స్థాయిలో 48 వేల థియేటర్స్ లో రోబో 2.0ని రిలీజ్ చేశారు. దాదాపు 25$ మిలియన్ డాలర్ల బిజినెస్ చేసిన 2.0పై అక్కడ ట్రేడ్ వర్గాలు కూడా చాలా అంచనాలే పెట్టుకున్నాయి. అంత టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా అతి కష్టం మీద ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి సినిమా అక్కడ 3.09 మిలియన్ మార్క్ ని మాత్రమే వసూల్ చేసి భారీ నష్టాలని మిగిలించింది. మొత్తంగా 25$ మిలియన్ టార్గెట్ లో కేవలం 3 మిలియన్స్ రికవరీ అవ్వగా ఏకంగా 22 మిలియన్ వరకు లాస్ ని మిగిలించి చైనా మార్కెట్ లో ఆల్ టైం ఇండియాస్ బిగ్గెస్ట్ డిసాస్టర్ గా 2.0 మిగిలిపోయింది.