ప్రముఖ హీరోకు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్

ప్రముఖ హీరో శరత్ కుమార్ కరోనా బారిప పడ్డారు. ఈ విషయాన్ని ఆయన భార్య రాధిక శరత్ కుమార్ స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం శరత్ కుమార్ హైదరాబాద్‌లో ఉన్నారని, ఆయనకు కరోనా సోకినా లక్షణాలు మాత్రం లేవన్నారు. ప్రస్తుతం ఆయన మంచి డాక్టర్ల చేతుల్లో ఉన్నారని, ఆయన ఆరోగ్య సమాచారం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటానని రాధిక శరత్ కుమార్ తెలిపారు.

SARATHKUAR

గత కొంతకాలంగా శరత్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతుండగా.. తాజాగా వైద్యులను సంప్రదించాని, ఈ సందర్భంగా కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. శరత్ కుమార్ ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అసవరం లేదని రాధిక చెప్పారు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన శరత్ కుమార్.. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు కూడా తీశారు.

ఇక టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టెలివిజన్ నిర్మాణాల్లో భాగం పంచుకున్నారు. మరోవైపు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఆల్ ఇండియా సమథువా మక్కల్ కచ్చి అనే పార్టీని స్థాపించి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ప్రస్తుతం తమిళంలో వాన్ కొట్టమ్, పరింధాల్ ప్రజాశక్తి, అందగత్తే, మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో నటిస్తున్నారు. శరత్ కుమార్ తెలుగులో అనేక సినిమాల్లో నటించారు భరత్ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, జయ జానకి నాయక, దేవదాస్ లాంటి సినిమాల్లో నటించారు.