నిత్య పెళ్లికొడుకు.. మరో పెళ్లి చేసుకోనున్న ప్రభుదేవా

ఇండియ‌న్ మైకెల్ జాక్సన్‌గా పేరుతెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫ‌ర్, డైరెక్టర్ ప్రభుదేవా మరో పెళ్లి చేసుకోనున్నాడని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. తన సొంత సోదరి కుమార్తె‌తో ప్రభుదేవా కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడని, ఆమె కూడా ప్రభుదేవాను ఇష్టపడిందని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు వారిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. తమిళ ఆచారం ప్రకారం సోదరి కుమార్తెను వివాహం చేసుకోవడం ఆచారం.

PRABHUDEVA

గతంతో రామలత అనే అమ్మాయిని ప్రభుదేవా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నయనతార వల్లనే వీరిద్దరు విడాకులు తీసుకున్నారనే ప్రచారం ఉంది. నయనతారను పెళ్లి చేసుకోవడం కోసమే తన భార్యకు ప్రభుదేవా విడాకులు ఇచ్చాడనే వార్తలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు నయనతారతో కలిసి ఉన్న ప్రభుదేవా.. ఆ తర్వాత ఆమెకు కూడా దూరమయ్యాడు.

ఇప్పుడు మళ్లీ తన సొంత సోదరి కుమార్తె‌ను ప్రేమించాడని, త్వరలోనే వీరి పెళ్లి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ప్రభుదేవా ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో రాధే సినిమాను ప్రభుదేవా తెరకెక్కిస్తున్నాడు.