Prabhas Adipurush: మూడవ షెడ్యూల్ షూట్ మొదలు పెట్టిన ప్రభాస్ ఆదిపురుష్

Prabhas Adipurush: మూడవ షెడ్యూల్ షూట్ మొదలు పెట్టిన ప్రభాస్ ఆదిపురుష్: 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టి సీరీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ఆదిపురుష్ షూటింగ్ మూడవ షెడ్యూల్ ఈ రోజు (జూలై 3) ముంబైలో ప్రారంభమవుతుంది.తాజాగా దర్శకుడు ఓం రౌత్ తన కారులో షూట్ లొకేషన్‌కు ప్రయాణిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకున్నారు. దానికి అతను #ఆదిపురుష్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు. ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్‌లో “రాధే శ్యామ్” తుది షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్నారు. ఆ సినిమా పూర్తి చేసిన తర్వాత ముంబైలోని “ఆదిపురుష్” జట్టులో చేరనున్నాడు. “ఆదిపురుష్” 2022 ఆగస్టు 11న థియేటర్లలో పలు ఇండియా భాషలలో విడుదల కానుంది.