Powerstar: సినీ, రాజ‌కీయాల్లో బిజీ.. తిరుమ‌ల‌లో కాషాయ దుస్తుల్లో ప‌వ‌ర్‌స్టార్‌

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒక వైపు సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంటూ, మ‌రోవైపు రాజ‌కీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానంకు వెళ్లారు ప‌వ‌న్‌. గ‌త మూడు రోజులు నుంచి తిరుప‌తిలో పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో ప‌వ‌న్‌క‌ళ్యాన్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే శుక్ర‌వారం తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని ఆయ‌న ద‌ర్శ‌నం చేసుకున్నారు.

powerstar

పూర్తి సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఉన్నా Powerstar ప‌‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకుని చాలా రోజులైంద‌ని.. క‌రోనా నేప‌థ్యంలో శ్రీ‌వారికి ద‌గ్గ‌రికి రాలేక‌పోయాన‌ని.. ఈ రోజు స్వామి ఆశీస్సులు ల‌భించాయ‌ని Powerstar ప‌వ‌న్ పేర్కొన్నారు. అలాగే ఇక్క‌డ రాజ‌కీయాలు మాట్ల‌డ‌వ‌ద్ద‌ని.. రాజ‌కీయాల‌పై తిరుప‌తి ప్రెస్‌మీట్‌లో మాట్లాడ‌తాన‌ని ఒక రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చాడు. ఇదిలాఉంచితే.. పవ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌స్తుత చిత్రం వ‌కీల్‌సాబ్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అనంత‌రం మ‌ళ‌యాలంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌గా వ‌స్తున్న చిత్రంలో న‌టిస్తున్నారు.. అలాగే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు Powerstar ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.