వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా ఎంతవరకు వచ్చిందంటే?

ఇంకా మొదటి సినిమా విడుదల కాకముందే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మరో సినిమాను కూడా పూర్తి చేశాడు. క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఒక విభిన్నమైన సినిమా రూపొందుతోంది. అయితే సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది. షూటింగ్ ని కేవలం 40రోజుల్లోనే ఫినిష్ చేసినట్లు సమాచారం.

ఒకవైపు కరోనా ఉన్నా కూడా తగ్గని చిత్ర యూనిట్ షూటింగ్ ఫినిష్ అయ్యే వరకు కూడా మరో పని పెట్టుకోలేదు. అసలైతే దర్శకుడు క్రిష్ పవన్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఆలస్యం అవుతుందని తెలియడంతో వైష్ణవ్ తేజతో ఒక మంచి సందేశాత్మక సినిమాను చేశాడు. ఇక ఆ సినిమా షూటింగ్ అంత అయిపోయింధి. కేవలం ఒక పాట మాత్రమే షూట్ చేయాల్సి ఉందని డబ్బింగ్ పనులు కూడా చాలా వరకు ఫినిష్ అయినట్లు సమాచారం. ఇక సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేక థియేటర్స్ ఓపెన్ అయ్యేవరకు వెయిట్ చేస్తారా అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులో వెయిట్ చేయాల్సిందే.