పునర్జన్మల నేపథ్యంలో నాని బిగ్ బడ్జెట్ మూవీ..?

నేచురల్ స్టార్ నాని బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ శ్యామ్ సింఘ రాయ్ డిసెంబర్ నుండి పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ యొక్క మగధీర తరహాలో ఉంటుందని టాక్. ఈ చిత్రంలో నానీ శ్యామ్, సింఘా రాయ్ అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నరని తెలుస్తోంది. ఈ చిత్రం యొక్క ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లు కోల్‌కతా బ్యాక్ గ్రౌండ్ లో ఉంటాయట.

ఈ ఆసక్తికరమైన చిత్రానికి రాహుల్ సంకృతన్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది. శ్యామ్ సింఘా రాయ్ లో సాయి పల్లవి మరియు కృతి శెట్టి మెయిన్ హీరోయిన్స్ గా సెలెక్ట్ అవ్వగా మరో హీరోయిన్ పాత్ర కోసం నివేదా పెతురాజ్ ని అనుకుంటున్నారు. అయితే ఇంకా ఆ విషయంలో అధికారిక నిర్ణయం వెలువడలేదు. టక్ జగదీష్‌తో పూర్తయిన తర్వాత నాని ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నాడు. పునర్జన్మ భావనల ఆధారంగా రూపొందించిన ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని నిహారికా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున విషయం తెలిసిందే.