Megastar: రిప‌బ్లిక్ వేడుక‌ల్లో మెగా ఫ్యామిలీ.. ఎస్పీ బాలుకు ప‌ద్మ‌విభూష‌ణ్‌పై స్పందించిన మెగాస్టార్!

Megastar: నేడు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. భార‌త ప్ర‌జ‌లు జెండాలు ఎగుర‌వేస్తూ జాతీయ భావాన్ని చాటుకుంటున్నారు. తాజాగా చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌లో మెగాస్టార్ చిరంజీవి జెండాను ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్, ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్ పాల్గొన్నారు. దీనికి ముందు చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో ఆడియో ద్వారా ప్ర‌జ‌ల‌కు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలుపుతూ..

చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌లో ర‌క్త‌దానం చేస్తోన్న వారికి ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అదేవిధంగా నిన్న ప్ర‌ముఖ గాయ‌కుడు దివంగ‌త ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు వ‌చ్చిన సంద‌ర్భంగా..Megastar త‌న ప్రియ‌మైన సోద‌రుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యానికి ప‌ద్మ‌విభూష‌ణ్ రావ‌డం ప‌ట్ల చాలా ఆనందంగా ఉంద‌ని చెప్పారు. అలాగే ఈ అవార్డుకు ఆయ‌న అర్హుడ‌ని అన్నారు.

కానీ మ‌ర‌ణానంత‌రం వ‌చ్చిన ప‌ద్మ‌విభూష‌ణ్ అనే ప‌దం ఉండ‌డం మాత్రం త‌న‌ను చాలా బాధిస్తోంద‌ని Megastarచిరంజీవి తెలిపారు. ఆయ‌న ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును వ్య‌క్తిగ‌తంగా స్వీక‌రించి ఉంటార‌నే భావిస్తున్నాన‌ని అన్నారు. ఇక అలాగే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన పార్టీ ఆఫీస్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకున్నారు. భార‌తీయులకి గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు జైహింద్ తెలిపారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్.