Maheshbabu: దుబాయ్‌లో షూటింగ్ సేఫ్.. అక్క‌డి మీడియాతో సూప‌ర్‌స్టార్‌..

Maheshbabu: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కార్ వారి పాట. ఈ చిత్రాన్ని గీతాగోవిందం ఫేం ద‌ర్శకుడు ప‌రుశురామ్ డైరెక్ట్ చేస్తుండ‌గా.. ఇందులో మ‌హేశ్‌బాబు స‌ర‌స‌న తొలిసారి కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్ర మొద‌టి షెడ్యూల్ షూటింగ్ కోసం దుబాయ్‌లో ప్లాన్ చేశారు. దీంతో ఇటీవ‌లే ఈ చిత్ర‌బృందం దుబాయ్‌కు వెళ్లింది. ఇప్పుడు ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న Maheshbabu మ‌హేశ్‌బాబు.. అక్క‌డి షూటింగ్ ప‌రిస్థితుల‌ను, వాతావ‌ర‌ణంను ఓ మీడియాతో పంచుకున్నాడు.

maheshbabu

దుబాయ్ న‌గ‌రంలో సుర‌క్షితంగా షూటింగ్ జ‌రుగుతుంద‌ని, అలాగే ప్ర‌పంచ దేశాల‌లో దుబాయ్ ఒక సుంద‌ర‌మైన ప్ర‌దేశం. తాను గ‌తంలో ఎన్నోసార్లు దుబాయ్‌కి వ‌చ్చాన‌ని, అలాగే త‌మ సినిమా షూటింగ్ జ‌రుపుతున్న‌ప్పుడు సిబ్బంది న‌గ‌రంలో క‌రోనా ప్రోటోకాల్ పాటిస్తూ.. సుర‌క్షితంగా కేర్ తీసుకుంటున్న‌ట్లు తెలిపాడు Maheshbabu. ఇక ఈ చిత్రాన్ని జీఎంబీ ప్రొడ‌క్ష‌న్స్‌, 14రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే గ‌తేడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసి భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నారు మ‌హేశ్ Maheshbabu‌. కాగా ఇప్పుడు మ‌రోసారి సంక్రాంతి బ‌రిలోకి దిగ‌డానికి స‌న్నాద్ధం అయ్యాడు. స‌ర్కార్ వారి పాట చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది 2022లో రిలీజ్ చేయ‌నున్నారు చిత్ర‌బృందం.