Kollywood: ఏజెంట్ ఆత్రేయ‌గా త‌మిళ స్టార్ క‌మెడియ‌న్‌..

Kollywood: టాలీవుడ్‌లో బాక్సాఫీస్ విజ‌యం అందుకున్న డిటెక్టివ్ కామెడీ యాక్ష‌న్ చిత్రం ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల నుంచి ప్రేక్ష‌కుల వ‌ర‌కు ఎంతో ఆద‌ర‌ణ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ఆర్ఎస్జె స్వ‌రూప్ ద‌ర్శ‌క‌త్వంలో.. న‌వీన్ పొలిశెట్టి హీరోగా ఈ చిత్రం తెర‌కెక్క‌గా.. న‌వీన్‌కు ఈ చిత్రం ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

agent sai

న‌వీన్ పాత్ర‌ను Kollywood త‌మిళ ప్ర‌ముఖ క‌మెడియ‌న్ సంతానం పోషించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే కామెడీ రోల్స్ చేసి హీరోగా కూడా వ‌రుస సినిమాల‌తో బిజీ అవుతున్నాడు. అయితే ఈ చిత్రానికి Kollywood త‌మిళ ద‌ర్శ‌కుడు మ‌నోజ్ బీదా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అలాగే ఈ చిత్రంలో సంతానం జోడీగా రియా సుమ‌న్ అనే కొత్త హీరోయిన్ న‌టిస్తోంది. అయితే దీనికి సంబంధించిన విష‌యం త్వ‌ర‌లోనే అధికారి‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ట చిత్ర‌బృందం. ఇక న‌వీన్ పోలిశెట్టి ప్ర‌స్తుతం జాతిరత్నాలు చిత్రంలో న‌టిస్తుండ‌గా.. అలాగే సంతానం ప్ర‌స్తుతం స‌భాప‌తి అనే మూవీలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో పోషిస్తున్నాడు.