మహేష్ బాబు, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్టయినట్లే..తెరపైకి వచ్చేది ఎప్పుడంటే?

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మొదట వచ్చిన సినిమా అతడు. ఆ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఖలేజా. అయితే ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగా సక్సెల్ కాలేకపోయింది. కానీ మహేష్ బాబు కెరీర్ కి మాత్రం ఒక యూ టర్న్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ సినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది.

ఇక ఖలేజా సినిమా వచ్చి పదేళ్లవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక మేకింగ్ వీడియోను పోస్ట్ చేసిన మహేష్ ఆ సినిమా చేయడం వలన తనలోని ఒక.కొత్త నటుడు బయటకు వచ్చాడని, అందుకు మిత్రుడు త్రివిక్రమ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు మహేష్ వివరణ ఇచ్చారు. అంతే కాకుండా భవిష్యత్తులో ఒక ప్రాజెక్టు కూడా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చూస్తుంటే వీరిద్దరు మళ్ళీ కలవబోతున్నట్లు అర్థమవుతోంది. కానీ అది సెట్స్ పైకి రావడానికి చాలా టైమ్ పడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ తో చేస్తున్న సర్కారు వారి పాట అనంతరం రాజమౌళితో మరో సినిమా చేయనున్నాడు. బహుశా ఆ తరువాత అంటే 2022లో త్రివిక్రమ్ తో సినిమాను చేసే అవకాశం ఉంటుంది.