నవంబర్ లోనే గుమ్మడికాయ కొట్టేస్తారా?

ఎఫ్ 2 సినిమాతో మంచి జోష్ లో ఉన్న దర్శకుడు అనీల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో వస్తున్న మొదటి సినిమా సరిలేరు నీకెవ్వరూ. మహేశ్ మొదటిసారి ఆర్మీ మేజర్ అజయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కర్నూల్ కొండారెడ్డి బుర్జ్ సెట్ లో సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ జరుగుతోంది. కొండారెడ్డి బుర్జ్ తో మహేశ్ బాబుకి, అతని అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఉన్నాయి.

మహేశ్ 7వ సినిమా ఒక్కడు సినిమాలో కొండారెడ్డి బుర్జ్ సీన్ కి ఫిదా అవ్వని సినీ అభిమాని ఉండి ఉండడు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కూడా అలాంటి సీన్ ఒక్కటి పడితే ఘట్టమనేని అభిమానులంతా నోస్టాల్జిక్ ఫీలింగ్ లోకి వెళ్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ సెప్టెంబర్ 13న అయిపోతుందని, సంక్రాంతికి రిలీజ్ ఎయిమ్ చేస్తున్న చిత్ర యూనిట్ నవంబర్ చివరి కల్లా సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. షూట్ కంప్లీట్ అవగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రొమోషన్స్ ని కూడా మొదలుపెట్టి సంక్రాంతి సమయానికి భారీ హైప్ క్రియేట్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.