సర్కారు వారి పాట హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్

కీర్తి సురేష్ సర్కారు వారి పాటాలో మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్నట్లు ఫైనల్ క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసుకున్నారు గాని ఆమె సన్నబడటం వలన మళ్ళీ చిత్ర యూనిట్ మైండ్ చేంజ్ అయినట్లు టాక్ వచ్చింది.

కానీ ఆ రూమర్స్ అన్ని కీర్తి సురేష్ పుట్టినరోజు అబద్దాలని తేలిపోయింది. హీరో మహేష్ బాబు మహానటికి బర్త్ డే విషెస్ అందిస్తూ.. సూపర్ టాలెంటెడ్ కీర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియజేశారు. సర్కారువారిపాట మిమ్మల్ని స్వాగతిస్తోంది. ఇది మీ మరపురాని చిత్రాలలో ఒకటి అని నిర్ధారించుకోండి, గొప్పది!..అంటూ మహేష్ తన విషెస్ అందించారు. ఇక ‘గీతా గోవిందం’ ఫేం పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారు వారీ పాతా’. 14 రీల్స్ మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్ల సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది.