డిసెంబర్‌లో శింబు, త్రిష కృష్ణన్ పెళ్లి చేసుకోబోతున్నారు?

సింబూ మరియు త్రిష కృష్ణన్ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చిత్ర పరిశ్రమలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాని వారి పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు. ఇక ఇప్పుడు మరోసారి వీరి పెళ్లిపై మరొక న్యూస్ వైరల్ అవుతోంది. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలలో ప్రచారం చేస్తున్న టి రాజేంద్రన్ ఇటీవల మీడియాతో సంభాషించారు.

చర్చల సమయంలో శింబు వివాహం గురించి ప్రశ్నించారు, కాని అతను సమాధానం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. ఇక ఇప్పుడు ప్రేమ పక్షులు త్రిష కృష్ణన్, సింబు ఈ ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రయివేట్ గానే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని టాక్ వస్తోంది. త్రిష కృష్ణన్, సింబు కలిసి ‘అలై’, ‘విన్నైతండి వరువాయ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో చిత్రీకరించిన ‘కార్తీక్ డయల్ సేతా యెన్’ అనే షార్ట్ ఫిల్మ్ లో కూడా వారు నటించారు. లాక్డౌన్ రోజులలో సింబు దాదాపు 20 కిలోలు తగ్గాడు. సరికొత్త లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇక పెళ్లి విషయంలో ఈ స్టార్ నటుడు ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి..