రాజమౌళి సినిమా కంటే ముందే మహేష్ పాన్ ఇండియా ప్లాన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఆయాన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్, రామ్ చరణ్ , బన్నీ వంటి స్టార్ హీరోలు పాన్ ఇండియా కథలను అలవాటు చేసుకుంటున్నారు.

ఇక రాజమౌళితో మహేష్ సినిమా చేయనున్నాడు అని ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా తప్పకుండా బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో రిలీజ్ చేసేలా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించానున్నారు. అయితే జక్కన్న సినిమా రావడానికి మరో మూడేళ్ళ సమయమైన పడుతుంది. కాబట్టి దాని కంటే ముందే మహేష్ పాన్ ఇండియా ప్రాజెక్టును రెడీ చేయనున్నాడట.

పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సర్కారు వారి పాట సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే కుంభకోణాల కాన్సెప్ట్ తో సినిమా కథ సాగుతుందట. ఇక మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రలో కనిపిస్తాడట. కీర్తి సురేష్ ఒక బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనుందట. మరి ఈ సినిమాతో మహేష్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.