‘మీ కలలను ఎప్పటికీ వదులుకోకండి’.. జాన్వీ గుంజన్ సక్సేనా సాంగ్ వైరల్

జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ఆల్బమ్ నుండి పాటలను వదులుతున్నారు. రీసెంట్ గా కొత్త పాట, డోరి తత్ గైయాన్ ని విడుదల చేశారు. పాట వింటుంటే సినిమాలో ఎమోషనల్ మూమెంట్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది

కష్టతరమైన సమయాల్లో కూడా తమ లక్ష్యాలను వెంబడించి, చివరికి వారి కలలను ఎలా నెరవేర్చుకున్నారనే లైన్ చాలా అద్భుతంగా ఉంది. డోరి తత్ గైయాన్ అనే ఈ కొత్త పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి పరిస్థితిలోనూ గట్టిగా పోరాడాలని మంచి అంశాన్ని సాంగ్ లో హైలెట్ చేశారు. వీడియోలో, బలహీనమైన వారికి స్థలం లేదని పేర్కొంటూ గుంజన్‌ను వైమానిక దళం అకాడమీని విడిచిపెట్టమని చెప్పే సీన్ హైలెట్ గా ఉంది. ‘మీ కలలను ఎప్పటికీ వదులుకోకూడదు’ అని జాన్వి కపూర్ చెప్పిన డైలాగ్ కూడా అద్బుతంగా ఉంది. ఈ పాటను అమిత్ త్రివేది స్వరపరిచారు మరియు సాహిత్యాన్ని కౌసర్ మునిర్ రాశారు, రేఖ భరద్వాజ్ ఈ పాటకి తన శక్తివంతమైన స్వరాన్ని ఇచ్చారు