‘కీర్తి సురేష్’ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గుడ్ లక్ సఖి’ లేటెస్ట్ అప్డేట్!!

హైదరాబాద్ బ్లూస్ ఫేమ్ నాగేష్ కుకునూర్ తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమలో కీర్తి సురేష్ సినిమా ద్వారా అడుగుపెట్టారు. ఈ ఫిల్మ్ మేకర్ గుడ్ లక్ సఖి అనే సినిమాతో పవర్ఫుల్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఆర్చరీ ఆధారంగా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కూడా ఉన్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్‌ కి ఇటీవల చిత్ర యూనిట్ ఎండ్ కార్డ్ పెట్టినట్లు తెలిపింది. ఈ చిత్ర షూటింగ్ ముగిసిందని చిత్ర నిర్మాత శ్రావ్య వర్మ వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రకటించినందుకు సంతోషంగా ఉందని ఇది ఒక అందమైన రోలర్ కోస్టర్ రైడ్ అని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర పాదిరి మరియు శ్రావ్య వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇక దిల్ రాజు ఇప్పటికే సినిమా రిలీజ్ హక్కులను తీసుకున్నట్లు సమాచారం. కానీ, ఈ చిత్రం OTTలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.