టాలీవుడ్‌కు కేసీఆర్ భారీ తాయిలాలు

టాలీవుడ్‌కు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లలో షోలో పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా సినిమా థియేటర్లలో టికెట్ల ధరలు సవరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే థియేటర్లకు కరెంట్ బిల్లులు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.10 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్ మెంట్ సాయం అందిస్తామన్నారు.

ఇవాళ జీహెచ్‌ఎంసీ టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫోస్టోను కేసీఆర్ విడుదల చేశారు. సినిమా థియేటర్ల ఓపెన్‌కు సంబంధించి ఈ రోజు జీవో ఇస్తామని చెప్పారు. సినిమా పెద్దలు చర్చించుకుని సినిమా థియేటర్లు ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చంది. 40 వేల సినీ కార్మికులకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందిస్తామని కేసీఆర్ చెప్పారు. తనను

హీరో చిరంజీవి, నాగార్జునతో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ , తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఛైర్మన్ సి.కల్యాణ్ వచ్చి కలిసినట్లు కేసీఆర్ చెప్పారు.

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వల్ల చాలామంది సినీ కార్మికులు జీవనం సాగిస్తున్నారని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ముంబై తర్వాత హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీకి వేదికగా మారిందని కేసీఆర్ తెలిపారు