పోలీసుల వద్దకు కరణ్ జోహార్?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజమ్ కి సంబంధించిన కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలీవుడ్ సెలబ్రెటీస్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎప్పుడైతే సూసైడ్ చేసుకున్నాడో అప్పటి నుంచి కరణ్ జోహార్ పై విమర్శల డోస్ పెరుగుతున్న విషయం తెలిసిందే.

ఓ వైపు కంగనా అలాగే మరికొందరు సెలబ్రెటీస్ విమర్శలు చేస్తుండగా మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండడం కరణ్ జోహార్ ని సోషల్ మిడియాలోకి రానివ్వకుండా చేశాయి. అయితే రోజురోజుకి కామెంట్స్ డోస్ పెరుగుతుండడంతో కరణ్ జోహార్ టీమ్ లీగల్ యాక్షన్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆఖరికి కరణ్ జోహార్ పిల్లలపైనే కాకుండా తల్లిపై కూడా బుతులతో కించపరిచేలా కామెంట్స్ వస్తున్నాయని తెలుసుకున్న కరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరైతే తప్పుగా కామెంట్స్ చేస్తున్నారో వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయడానికి కరణ్ జోహార్ గ్యాంగ్ రెడీ అయినట్లు సమాచారం.