బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరికొంతమంది నటులు.. త్వరలోనే విచారణ?

డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ పేర్లు బయటపడటంతో దేశం మొత్తం ఒక్కసారిగా షాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు నటీమణులను పిలిపించి గంటల తరబడి విచారించారు. అయితే ఆ విచారణ తరువాత బాలీవుడ్ టాప్ నటులు పేర్లు కూడా బయటపడినట్లు టాక్ వస్తోంది. ఇక వారిని త్వరలోనే పిలిపించవచ్చని బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ తో పాటు యువ హీరోలు రణబీర్ కపూర్, అర్జున్ రాంపాల్ కూడా అధికారుల లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ చాట్ల ద్వారా పేర్లు డీకోడ్ చేయడంలో జాతీయ మీడియా వాటిపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీపికా పదుకొనే సహ నటులు లిస్ట్ లో ఉన్నారని, హిందీ సినిమాకు చెందిన ఈ అగ్ర నటులను త్వరలోనే పిలిపించనున్నట్లు ఉహాగానాలు వస్తున్నాయు. ఇక ఇప్పటికే అనేక మంది మాదకద్రవ్యాల పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ డ్రగ్ రాకెట్‌లో పాల్గొన్న ఇతర ప్రముఖుల పేర్లను బయటకు తీసేందుకు వారి కాల్ రికార్డులను గుర్తిస్తున్నారు.