ఢీ సీక్వెల్ లో భారీ మార్పులు.. బ్రహ్మానందం పాత్రలో స్టార్ కమెడియన్

2007లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మంచు విష్ణు, జెనీలియా మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకుంది. అయితే ఆ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ ని రూపొందించాలని దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అసలు మ్యాటట్ ఏమిటంటే.. సినిమాలో బ్రహ్మానందం చేసిన చారి పాత్ర ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో అందరికి తెలిసిందే. అయితే సీక్వెల్ లో బ్రహ్మానందం ఉండడు అనే టాక్ వస్తోంది. అదే తరహాలో ఉండే మరో మరో చారి పాత్రను డిజైన్ చేసారట దర్శకుడు. ఆ పాత్రలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీ హరి మరణించారు కాబట్టి శంకర్ గౌడ్ పాత్రలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. త్వరలోనే సినిమాకి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.