అజిత్ కూడా పాన్ ఇండియా అంటున్నాడు

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో స్పెషల్ క్రేజ్ ఉంది. ఇక అజిత్ లాంటి స్టార్ హీరో ఇప్పటికే అక్కడ 100కోట్లకు పైగా మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. అయితే కోలీవుడ్ లో రజినీకాంత్ నుంచి కార్తీ వరకు ఇతర భాషల్లో ఒక మార్కెట్ ని సెట్ చేసుకున్నారు. విజయ్ సినిమాలు కూడా తెలుగులో క్లిక్కవుతున్నాయి.

ఇక అజిత్ కూడా తన మార్కెట్ ను పెంచుకోవాల్సి ఉంది. అందుకే నెక్స్ట్ తన సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. H.వినోద్ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాను అన్ని భాషల్లో భారీగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ ప్రాజెక్టును శ్రీదేవి భర్త బోణి కపూర్ నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ లో ఆయన సపోర్ట్ తో ఎలాగూ సినిమాని భారీగా రిలీజ్ చేస్తారు. ఇక తెలుగులో పెద్ద ప్రొడ్యూసర్ సహాయంతో సినిమాను హై రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అజిత్ మొదటి పాన్ ఇండియా సినిమా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.