ఇంత రెమ్యూనరేషనా?.. దీపికాకు రూ.15 కోట్లు

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘వార్’ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు షారూఖ్ ఓకే చెప్పాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. దీనికి ‘పఠాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో షారూఖ్ సరసన టాప్ హీరోయిన్ దీపికా పదుకొణే నటించనుంది.

ఇందులో జాన్ అబ్రహం విలన్ పాత్రను పోషించనున్నాడు. 2018 డిసెంబర్‌లో విడుదలైన ‘జీరో’ సినిమా తర్వాత షారూఖ్ చేస్తున్న సినిమా ఇదే. ‘జీరో’ సినిమా ఫ్లాప్ అవ్వగా.. అంతకుముందు షారూఖ్ నటించిన ‘జబ్ హ్యరీ మెట్ సెజల్’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌ను అందుకోలేకపోయింది. దీంతో రెండేళ్ల తర్వాత షారూఖ్ సినిమా చేస్తుండగా.. ఈ సినిమాతో అయినా షారూఖ్ హిట్ కొడతాడా?.. లేదా? అనేది చూడాలి.

అయితే ఈ సినిమాకు దీపికా పదుకొణే రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనుందని సమాచారం. షారూఖ్-దీపికా కలిసి నటిస్తే విజయం సాధించడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నారు.