తలైవి తర్వాత కొత్త అవతారం ఎత్తనున్న కంగనా రనౌత్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ ఇయర్ మణికర్ణిక సినిమాతో మంచి హిట్ అందుకుంది. దీని తర్వాత సౌత్ ని టార్గెట్ చేస్తున్న కంగనా, జయలలిత బయోపిక్ తలైవి సినిమా కోసం కష్టపడుతోంది. మూడు వేరియేషన్ లో కనిపించనున్న కంగనా, తలైవి కోసం క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలో బిజీలో కంగనా త్వరలో ఒక ప్రొడక్షన్ హౌజ్ పెట్టనుంది. తాను నిర్మాతగా మారుతున్నాను అని అనౌన్స్ చేసిన కంగనా, ఇదే విషయంపై మాట్లాడుతూ…

kangana

జ‌న‌వ‌రిలో నా కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం కానుంది. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌తి క‌థ‌లో నేను న‌టించ‌క‌పోవ‌చ్చు కానీ.. ప్ర‌తి మంచి క‌థ వెండితెర‌పై రావాల్సిన అవ‌స‌రం ఉంది. అందుక‌నే నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాను. ముందుగా చిన్న చిన్న సినిమాల‌ను నిర్మిస్తాం. అలాగే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ అడుగు పెట్టాల‌నుకుంటున్నాం. అయితే నా ప్రొడ‌క్ష‌న్‌లో నేను న‌టించ‌డం లేదు. ప్ర‌స్తుతం థాకడ్‌ ‘తలైవి’ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ రెండు అయిపోయాకే డైరెక్షన్ గురించి కూడా ఆలోచిస్తాను అనింది. ఇప్పటికే యాక్టర్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న కంగనా, దర్శక నిర్మాతగా మారి ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.