అయోధ్య రామమందిర నిర్మాణానికి అక్షయ్ భారీ విరాళం

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అయోధ్య రామాలయ నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ ట్విట్టర్‌లో తెలిపాడు. అయితే ఎంత విరాళం ఇచ్చానన్న విషయం మాత్రం అక్షయ్ బయటపెట్టడం గమనార్హం. అయితే అక్షయ్ భారీ మొత్తంలోనే విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది.

akshay fund ayodhya

ఈ సందర్భంగా దేశ ప్రజలంతా రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని అక్షయ్ సూచించాడు. అయోధ్య రాముడి ఆల‌య‌ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ‘జై శ్రీరాం’ అని అక్షయ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయెధ్య‌లో రామాల‌య నిర్మాణానికి విరాళాల సేక‌రణను ఇటీవ‌లే రామ జ‌న్మ‌భూమి ట్ర‌స్ట్, విశ్వ హిందూ ప‌రిష‌త్ ప్రారంభించిన విషయం తెలిసిందే.