ఆదిపురుష్ నుంచి రేపు క్రేజీ అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. రూ.300 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనుండగా.. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేయనున్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో ఈ సినిమాను మేకర్స్ తెరకెక్కించనున్నారు.

update from adipurush unit

తాజాగా ఆదిపురుష్ యూనిట్ నుంచి మరో అప్డేడ్ వచ్చింది. రేపు ఉదయం 7.11 గంటలకు ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఇస్తామని ఆదిపురుష్ సినిమా యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.