యుద్ధం ప్రకటిస్తా.. జగన్‌పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

సీఎం వైఎస్ జగన్ పాలనపై నందమూరి నటసింహం బాలకృష్ణ విరుచుకుపడ్డారు. ఏపీలో రాక్షస పాలన నడుస్తోందని, ఇది మన దురదృష్టకరమని దమ్మెత్తి పోశారు. ఆదివారం నెల్లూరు జిల్లా నాయకులతో బాలయ్య ఫోన్‌లో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల ప్రచారం క్రమంలో కావలి మండలి రుద్రకోటలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డితో పాటు కార్యకర్తలతో బాలయ్య ఫోన్‌లో మాట్లాడారు.

BALAYYA ON JAGAN Rule

ఈ సందర్భంగా.. బోయపాటి సినిమా పూర్తైన తర్వాత రోడ్లమీదకి వచ్చి ప్రజలందరినీ కలుస్తానన్నారు. ఏపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తానని, తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. త్వరలో గుంటూరు జిల్లాలో జరగనుంది.