బాలీవుడ్ లో అరుంధతి రీమేక్.. హీరోయిన్ ఎవరంటే?

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సినిమాల్లో అరుంధతి ఒకటి. అనుష్క కెరీర్ మంచి యూ టర్న్ ఇచ్చిన ఆ సినిమాను కోడి రామ కృష్ణ తెరకెక్కించగా ప్రముఖ నిర్మాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. 2009లో వచ్చిన ఆ సినిమా ఇప్పటికి కూడా టీవీలలో మంచి టీఆర్పీని అందుకుంటుంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఆ సినిమా కథ 11 ఏళ్ళ తరువాత బాలీవుడ్ లో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. సినిమా హిందీ హక్కులను ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ఫ్యాన్సీ రేటుకు కొన్నట్లు తెలుస్తోంది. ఫాంటమ్ ఫిలిమ్స్, బ్రాట్ ఫిలీమ్స్ తో కలిసి బాలీవుడ్ లో హై బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ గా దీపికా పదుకొనె సినిమాలో మెయిన్ లీడ్ లో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు టాక్.