సినీ లవర్స్‌కి గుడ్ న్యూస్

సినీ ప్రేక్షకులకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని AMB సినిమాస్ గుడ్‌న్యూస్ తెలిపింది. ఈ నెల 4వ తేదీ నుంచి థియేటర్‌ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించింది. 4వ తేదీ నుంచి సినిమాలను ప్రదర్శిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ అంటూ ఓ పోస్టర్‌ను ఏఎంబీ సినిమాస్ విడుదల చేసింది. థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. థియేటర్ల యాజమాన్యాలు మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు.

amb cinemas

అయితే థియేటర్లను ఓపెన్ చేసేందుకు ముందుగా ఏఎంబీ ముందుకొచ్చింది. ఏఎంబీ సినిమాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించినది అనే విషయం మనందరికీ తెలిసిందే. లాక్‌డౌన్ వల్ల మూతపడిన ఏఎంబీ థియేటర్ ఇప్పుడు మళ్లీ చాలాకాలం తర్వాత మళ్లీ ఓపెన్ కాబోతోంది.

కరోనా ప్రభావం, లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యారు. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయితే ప్రేక్షకులు థియేటర్లకు వెళతారా?.. లేదా అనేది చూడాలి.