ఒక్క పాటతోనే కోటి కొట్టేశారు…

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో, ఈ సినిమా నుండి సామజవరగమనా అంటూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ యూత్ ఫుల్ రొమాంటిక్ స్టైల్ ట్యూన్ ఇచ్చాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు రాసిన ఈ పాటకు సిద్ శ్రీరామ్ పాటకి ప్రాణం పోశాడు. యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ సాంగ్, మూడు రోజుల్లో కోటి వ్యూస్ సాధించి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు, అక్కినేని సుశాంత్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, నివేత పేతురాజ్ తదితరులు ఇతర ముఖ పాత్రల్లో నటిస్తున్నారు. పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మంచి ఎంటర్టైనింగ్ గా కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి తెలుగు ప్రేక్షకుల్లో ఒక్క పాటతోనే మంచి అంచనాలు క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.