Tollywood: అఖిల్‌తో ఉప్పెన ఫేం కృతిశెట్టి రొమాన్స్‌..

Tollywood: అక్కినేని అఖిల్ తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌. ఈ చిత్రాన్ని బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో అఖిల్ స‌ర‌స‌న పూజా హెగ్దే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైనా పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం.

akhil-surenderreddy

Tollywood ఇక ఈ సినిమా అనంత‌రం అఖిల్, సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. గుర్రాల రేసింగ్‌, బెట్టింగుల నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తి క‌లిగించేలా ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌ను సురేంద‌ర్ రెడ్డి ప్లాన్ చేశార‌ట‌. ఇందులో అఖిల్ స‌ర‌స‌న ఉప్పెన ఫేం హీరోయిన్ కృతిశెట్టిని తీసుకున్నార‌ట‌. ఇక Tollywood ఈ సినిమాలో అఖిల్ హార్స్ రైడ‌ర్ కం రేస‌ర్‌గా క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఇక సుధీర్‌బాబు చిత్రంలో కృతి హీరోయిన్‌గా చేస్తోంది.. దీంతో పాటు మ‌రో మూడు సినిమాల్లో న‌టించ‌డానికి ఓకే చెప్పింది కృతిశెట్టి. ‌