కోలీవుడ్ ప్రముఖులపై కలైపులి పరువు నష్టం దావా వేయనున్నారా?

kalaipuli s thanu

కోలీవుడ్ లో ప్రస్తుతం ఒక వార్త సంచలనంగా మారింది వి క్రియేషన్స్ యొక్క నిర్మాత కలైపులి ఎస్ థను కొందరు కోలీవుడ్ సినీ ప్రముఖులపై పరువు నష్టం కేసులు నమోదు చేసినట్లు సమాచారం. నిర్మాత సింగరవెలన్ ఆర్ యొక్క ఆడియో ఫైల్ ఆన్‌లైన్‌లో బయటపడిన తర్వాత అసలు సమస్య ప్రారంభమైంది. ఆ నిర్మాత తన గురించి చెడుగా మాట్లాడాడని చాలా మంది పరిశ్రమ వ్యక్తులతో ఆ విషయాన్ని చెబుతున్నాడని కలైపులి ఆరోపించారు.

నిరాధారమైన ఆరోపణలతో మోసం చేయడంతో పరువునష్టం దావా వేయడానికి ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఆ ఆడియోను అందరి నిర్మాతలకు చేరేలా వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారట. కార్తీ కూడా ఆ గ్రూపులో ఉన్నందున, అతని పేరు కూడా కేసులో కీలకంగా మారింది. నిర్మాత కలైపులి ఇప్పటికే చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్‌లైన్ లో ఫిర్యాదు చేశారు. వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులు సింగరవేలన్ ఆర్, కార్తీలు తన గురించి తప్పుడు నివేదికలను సోషల్ మీడియాలో నకిలీ పత్రాలతో ప్రచారం చేస్తున్నారని కలైపులి ఎస్ థను తన ఫిర్యాదులో పేర్కొన్నారు.