మనల్ని మనమే కాపాడుకోవాలి: మహేష్ బాబు

mahesh babu

సామాజిక అంశాల గురించి మహేష్ ఏ విధంగా స్పందిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ ఏం చెప్పినా కూడా అభిమానులను ఎంతగానో ఆలోచింపజేస్తాయి. అయితే ఇటీవల ప్రకృతి గురించి అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి తన విలువైన సందేశాన్ని ఇచ్చారు మహేష్.

‘వాటర్ ని సంరక్షించాలి. వనరులను పునరావృతం అయ్యేలా ఉపయోగించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని చాలా వరకు తగ్గించాలి. ఈ గ్లోబల్ క్రైసిస్ ని నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. మార్పు అనేది మన నుంచి, మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అని మాహేష్ బాబు ట్విట్టర్ ద్వారా చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.