బాలీవుడ్ కి మరో షాక్.. ప్రముఖ నటుడు కన్నుమూత

విక్కీ డోనర్, పర్మను వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ బాలీవుడ్ నటుడు భూపేశ్ కుమార్ హఠాత్తుగా కన్నుమూశారు. పాండ్యా గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాదితో బాధపడుతున్నారు. ఆయన మరణ వార్తను గురింవహి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డి) బుధవారం ట్విట్టర్ ద్వారా తెలిపింది.

భూపేష్ కుమార్ పాండ్యా (ఎన్ఎస్డి 2001 బ్యాచ్ కు చెందిన విద్యార్థి) మరణ వార్త చాలా విచారకరం. ఎన్ఎస్డి కుటుంబం హృదయపూర్వక నివాళి అర్పించింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆ స్కూల్ యాజమాన్యం ట్విట్టర్లో ప్రకటించింది. అంతకుముందు, మనోజ్ తన చికిత్స కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉందని, నిధుల సమీకరణకు సంబంధించి లింక్‌ను ట్వీట్ చేశాడు. ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్ వంటి నటులు కూడా ఈ లింక్‌ను షేర్ చేశారు. అలాగే పాండ్యాకు సహాయం చేయమని వారు ట్విట్టర్ అనుచరులను కోరారు.