రాక్షసుడు సీక్వెల్ కి రంగం సిద్ధం?

అల్లుడు శ్రీను సినిమాతో సాలిడ్ స్టార్ట్ అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. హిట్ లేక చాలా కాలం పాటు ఎదురు చూసిన సాయి శ్రీనివాస్, రాక్షసుడు మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. తనలోని నటుడిని కూడా పరిచయం చేసిన సాయి శ్రీనివాస్ క్రిటిక్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా మెప్పించాడు. తమిళ సినిమాకి రీమేక్ గా వచ్చిన రక్షకుడు సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. తన కెరీర్ కష్టాల్లో ఉన్న టైములో హిట్ ఇచ్చింది కాబట్టి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రాక్షసుడు సినిమాకి సీక్వెల్ తీయాలనే ప్లాన్ లో ఉన్నాడట.

ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాలో నటిస్తున్న సాయి శ్రీనివాస్, ఈ మూవీ షూటింగ్ అయిపోగానే రాక్షసుడు సినిమా సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అవుతున్నాడట. రాక్షసుడు టీంనే కంటిన్యూ చేస్తున్న సాయి శ్రీనివాస్ స్క్రిప్ట్ వర్క్ కూడా దెగ్గరుండి చేసుకుంటున్నాడని సమాచారం. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నుంచి వచ్చే ఏడాది సమ్మర్ కల్లా రాక్షసుడు 2 చూసే అవకాశం ఉంది.