Upasana: చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్‌.. స్టాఫ్‌తో మ‌రింత బంధం బ‌ల‌ప‌డింది: ఉపాస‌న‌

Upasana: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే. హోం క్వారంటైన్‌లో ఉంటూ చ‌ర‌ణ్.. త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించి క‌రోనా నుంచి కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్ రాగానే తాను పెద్ద షాక్‌కు గుర‌య్యాన‌ని తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఉపాస‌న తెలిపింది‌. చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కాగానే.. మొద‌టి రెండు రోజులు చాలా ఇబ్బంది ప‌డ్డామ‌ని తెలిపారు. త‌మ‌తో ప‌నిచేసే స్టాఫ్ గురించే ఎక్కువ‌గా కంగారుప‌డ్డాం.

charan-upasana

ఎందుకంటే వాళ్లంద‌రూ Upasana మాతో క‌లిసే ఉంటారు.. దీంతో వెంట‌నే వాళ్లంద‌రికీ స‌మాచారం అందించి.. త‌ర్వాత తాను కూడా టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ వ‌చ్చినా.. మా స్టాఫ్ విష‌యంలో ఎదో తెలియ‌ని ఆందోళ‌న‌ క‌లిగింద‌ని ఉపాస‌న అన్నారు. ఇక మేమిద్ద‌రం ఇంట్లో అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు పాటించి.. అలాగే వైద్యులు చెప్పిన విధంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు పాటించి చ‌ర‌ణ్ క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. కానీ Upasana మేము రెండు, మూడు రోజులు ఇబ్బందిప‌డ్డాం, ఎంతో ఆందోళ‌న‌కు గుర‌య్యాం. కాగా మా స్టాఫ్‌ను ఎప్పుడు కుటుంబ‌స‌భ్యులుగానే భావించేవాళ్లం. ఇప్ప‌డు ఇంకా రెట్టింపు అయింది. ఒక‌రినొక‌రు గౌర‌వించుకుంటూ ప్రేమ‌, అభిమానం, అప్యాయ‌ల‌తో ఇబ్బందుల‌న్నింటినీ ఎదుర్కొవాల‌ని త‌మ‌కు అర్థ‌మైంద‌ని.. ఇన్నాళ్లు ఈ ప్ర‌యాణంలో మా స్టాఫ్‌తో మాకున్న అనుబంధం ఇప్పుడు మ‌రింత బ‌ల‌ప‌డిందని Upasana ఉపాస‌న పేర్కొంది.