లాక్ డౌన్ తరువాత థియేటర్స్ రీ ఓపెన్.. కలెక్షన్స్ ఎంతంటే?

మొత్తానికి సినిమా హాళ్లు కొన్ని చోట్లా మళ్ళీ ఓపెన్ అయ్యాయి. దాదాపు 7నెలల తరువాత మొదలైన సినిమా థియేటర్లకు అన్ని చోట్ల మోస్తరు స్పందన వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు లేరు. ప్రేక్షకుల సంఖ్యపై అధిక అంచనాలు లేనప్పటికీ, థియేటర్లు తిరిగి ప్రారంభమైన మొదటి రోజున నమోదైన పేలవమైన సంఖ్యతో థియేటర్స్ యాజమాన్యం షాక్‌కు గురైంది.

ఏపీలో గురువారం కొన్ని ప్రాంతాల్లో థియేటర్లను తిరిగి తెరిచినప్పటికీ, వాటిలో భీష్మా వంటి చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి. ఇక ఆ రోజు వసూళ్లు ఒక్కో ప్రదర్శనకు 1000 రూపాయల కన్నా తక్కువ రావడం ఆశ్చర్యకరం. మల్టీప్లెక్సుల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది.
వైజాగ్, వరుణ్ ఐనాక్స్ వద్ద స్క్రీన్ 6 లో ప్రసారం చేయబడిన భీష్మా అత్యల్ప గణాంకాలను నమోదు చేసింది. 3.35 PM ప్రదర్శన కోసం, నలుగురు ప్రేక్షకులు మాత్రమే టికెట్లను కొనుగోలు చేశారు, కేవలం 632 రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. సాధారణంగా అత్యంత రద్దీగా ఉండే 7 PM ప్రదర్శనకు కేవలం 6 మంది ప్రేక్షకులు వచ్చారు.

భీష్మా యొక్క మొత్తం ఆదాయం గురువారం వరుణ్ ఐనాక్స్ లో కేవలం రూ .1580 కాగా, మొత్తం నెట్ రూ.1239. ప్రేక్షకుల నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో ఎగ్జిబిటర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు మళ్ళీ భారంగా మారతాయి. ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తు మరింత ఎక్కువ నష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని ఎగ్జిబిటర్లు ప్రదర్శనలను ప్రదర్శించడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.