వరుసగా 10సినిమాలను లైన్ లో పెట్టిన టాలెంటెడ్ ప్రొడ్యూసర్

సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ అధినేత సూర్య దేవర నాగ వంశీ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది. చూస్తుంటే ఆయన త్వరలోనే సరికొత రికార్డు క్రియేట్ చేసేలా ఉన్నారని అనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా ఆయన పది సినిమాలను లైన్ లో పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా పూర్తిగా కమర్షియల్ సినిమాలు కాకుండా ఒక దానికి మరొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్నారు.

పైగా నేటితరం యువ దర్శకులకు మంచి అవకాశాలను ఇస్తూ నాగవంశీ అందరికి ఒక ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ ఏడాది ఛలో సినిమాతో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అనంతరం నితిన్ తోనే రంగ్ దే అనే మరో సినిమాను చేస్తున్నారు. ఇక నాగశౌర్య హీరోగా లేడి డైరెక్టర్ సౌజన్య దర్శకత్వంలో మరో సినిమాను రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలే కాకుండా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియం, ‘కప్పెల’ వంటి డిఫరెంట్ కథలను త్వరలోనే రిమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇక నాని ‘శ్యామ్ సింగ రాయ్’ని భారీ బడ్జెట్ లో నిర్మించబోతున్నట్టు నాగ వంశీ ఎప్పుడో ప్రకటించాడు. సిద్దు జొన్నల గడ్డ, మారుతీ, గౌతమ్ తిన్ననూరి, సుధీర్ వర్మ, కిశోర్ తిరుమల, శైలేష్ కొలను, వివేక్ ఆత్రేయ, సాగర్ చంద్ర వంటి టాలెంటెడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి ముందే అడ్వాన్సులు కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక థియేటర్స్ ఓపెనీ అయితే మాత్రం గ్యాప్ టూ గ్యాప్ సీతారా ఎంటర్టైన్మెంట్ లో వరుసగా 10సినిమాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.