సుమంత్ మహేంద్రగిరి ‘వారాహి’ టైటిల్ లోగో ఆవిష్కరణ !!

రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు – 2 సినిమాకు మహేంద్రగిరి వారాహి టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం హీరో సుమంత్ టైటిల్ లోగోను విడుదల చేశారు.

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరుగుతోందని, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

సుమంత్ , మీనాక్షి గోసామి, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు, కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు కథ మురళి రచన , దర్శకత్వం సంతోష్ జాగర్లపూడి.