బ్రేక్ అయిపొయింది… షూటింగ్ స్టార్ట్ అయ్యింది

హై స్పీడ్ తో సినిమాలు చేసే అక్షయ్ కుమార్ కరోనా బ్రేక్ నుంచి బయటకి వచ్చాడు. సెకండ్ ఫేజ్ తో సైలెంట్ అయిన అక్షయ్, లాక్‌డౌన్‌ నుంచి బయటకి వచ్చి ఫస్ట్ డే షూట్ కంప్లీట్ చేశాడు. అక్షయ్ కుమార్ సోమవారం తన కొత్త సినిమా ‘రక్షాబంధన్‌’ షూటింగ్‌ మొదలుపెట్టారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. క్లాప్‌ బోర్డ్‌ చేతిలో పట్టుకొని దర్శకుడితో సెట్స్‌లో ముచ్చటిస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అక్షయ్‌ పోస్ట్‌చేశారు. ‘నిజజీవితంలో నాకు పరిచయమైన తొలి స్నేహితురాలు సోదరి అల్క. అవధులు లేని స్నేహబంధం మాది. ‘రక్షాబంధన్‌’ సినిమాను అల్కకు అంకితం ఇస్తున్నా’ అని అక్షయ్‌ పేర్కొన్నారు. నలుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ కనిపించబోతున్నారు. ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భూమి ఫడ్నేకర్‌ కథానాయికగా నటిస్తోంది. ఫీల్ గుడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన ఆనంద్ ఎల్ రాయ్, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే అత్రంగి సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ రిలీజ్ కి రెడీగా ఉంది. అక్షయ్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సూర్యవంశీ కూడా విడుదలకి సిద్ధంగా ఉంది.