‘సిద్ధార్థ్ రాయ్’ నుంచి ఎమోషనల్ సాంగ్ ‘సిద్ధాంతం’ విడుదల  

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘సిద్ధాంతం’ పాటని విడుదల చేశారు. సినిమాలో చాలా కీలకమైన ఈ పాటని రధన్ పవర్ ఫుల్ ఎమోషనల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. బాలాజీ రాసిన సాహిత్యం కథలోని లోతుని డెప్త్ ని తెలియజేస్తుంది. సింగర్ శరత్ సంతోష్ మనసుని హత్తుకునేలా పాటని ఆలపించాడు.

ఈ ఎమోషనల్ నెంబర్ లో దీపక్ సరోజ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. యూనిక్ కాన్సెప్ట్, కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే వైరల్ అయి హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు విడుదలైన పాట సినిమాపై మరింత క్యురియాసిటీ పెంచింది.  శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ రధన్ సంగీతం అందించారు. శ్యామ్ కె. నాయుడు కెమరా మెన్ కాగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వి యశస్వీ
నిర్మాతలు: జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన
బ్యానర్లు: శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ & విహాన్, విహిన్ క్రియేషన్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
సహ రచయితలు: అన్వర్ మహ్మద్, లుధీర్ బైరెడ్డి
సంగీతం: రధన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
కొరియోగ్రఫీ: శంకర్, ఈశ్వర్ పెంటి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, బాలాజీ, పూర్ణా చారి, వి యశస్వీ
పీఆర్వో: వంశీ – శేఖర్