మరోసారి పోకిరి కాంబినేషన్.. బడా నిర్మాత న్యూ ప్లాన్?

దర్శకుడు పూరి జగన్నాధ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన పోకిరి మరియు బిజినెస్ మ్యాన్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక వీరిద్దరూ మూడోసారి జత కట్టాలని అనుకుంటున్నారు. కాని ఒక్క ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత నివేదికల ప్రకారం, అగ్ర నిర్మాత అనిల్ సుంకర ఒక చిత్రం కోసం మహేష్ బాబు మరియు పూరి జగన్నాధులను ఏకం చేస్తున్నారని టాక్.

సరిలేరు నీకెవ్వరు సూపర్ సక్సెస్ తర్వాత అనిల్ సుంకర కోసం మహేష్ మరో చిత్రానికి సంతకం చేశాడు. అనిల్ సుంకర మరియు పూరి జగన్నాధ్ కలిసి పనిచేయడం గురించి చర్చించారని సమాచారం. పూరీ స్క్రిప్ట్‌ను వివరించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఖరారవుతుందట. ఇంకా ఫైనల్ అయితే కాలేదు. మహేష్ జనవరిలో సర్కారు వారి పాటా చిత్రీకరణను ప్రారంభించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదల అవుతుంది. ఇక త్రివిక్రమ్ స్క్రిప్ట్ కోసం కూడా మహేష్ ఎదురుచూస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.