ఇటలీ బయలుదేరిన ప్రభాస్.. రాధేశ్యామ్ టార్గెట్ రెడీ

prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా ఇప్పటికే కొంత షూటింగ్ ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మిగతా షూటింగ్ ని త్వరగా పూర్తి చేయాలని సెప్టెంబర్ రెండవ వారంలోనే ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ప్లాన్ ఛేంజ్ చేశారు.

ఫైనల్ గా గురువారం, హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రభాస్‌ దర్శనమిచ్చాడు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ తో కలిసి ఇటలీకి బయలుదేరాడు ప్రభాస్. అక్కడే వింటేజ్ లొకేషన్స్ లలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక పూజా హెగ్డే షెడ్యూల్‌లో ఎప్పుడు పాల్గొంటారో చూడాలి. ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూటింగ్ పూర్తి చేయడానికి ఆ బ్యూటీ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు ప్రభాస్ రాదేశ్యామ్ షూటింగ్ ని పూర్తి చేసి 2021 జనవరిలో ‘ఆదిపురుష్’ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు.