ప్రముఖ టీవీ నటి మృతి

టీవీ సీరియల్స్ లో నటించే ప్రముఖ నటి పవిత్ర జయరామ్ ఆక్సిడెంట్ లో మరణించారు. ఒక విషాద పరిణామం, రోబోట్ ఫ్యామిలీ, జోకలి, నీలి, రాధా రమణ వంటి టీవీ షోల‌లో నటించిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్ర‌స్తుతం తెలుగు సీరియ‌ళ్ల‌తో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో కర్నూలు రోడ్ సమీపంలో ఆమె కారు బస్సును ఢీకొనడంతో ఈ ప్ర‌మాదం త‌లెత్తింది. మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. నటి ప‌విత్ర‌ అక్కడికక్కడే మరణించింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కన్నడలో తన చిన్న స్క్రీన్ ప్రయాణాన్ని ప్రారంభించిన పవిత్ర, రాధా రమణ సహా పలు విజ‌య‌వంత‌మైన సీరియ‌ళ్ల‌లో న‌టించారు. పవిత్ర జయరామ్ మండ్య(క‌ర్నాట‌క‌)లోని హనకెరె గ్రామానికి చెందినవారు. ఇటీవల ఆమె తెలుగు డైలీ సీరియల్స్‌తో బిజీగా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన త్రినయనిలో న‌టిస్తోంది. పవిత్ర ఆనంద్ ద‌ర్శ‌కురాలు కూడా. ఆమె స్వీయ‌ దర్శకత్వంలో తెర‌కెక్కించిన‌ కామెడీ సిరీస్ – రోబోట్ ఫ్యామిలీతో కన్నడ చిన్న తెరపై అడుగుపెట్టారు.

నటనతో పాటు పవిత్ర తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నిర్వహిస్తున్నారు. ఆమె తరచుగా తన టెలివిజన్ సీరియల్స్ సెట్స్ నుండి తెర‌ వెనుక వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తున్నారు. తాజా క‌థ‌నాల‌ ప్రకారం, పవిత్ర బుల్లితెర‌ వినోద ప్రపంచంలోకి ప్రవేశించడానికి ముందు బెంగళూరులో లైబ్రేరియన్‌గా, సేల్స్ గర్ల్‌గా కూడా పనిచేసారు. 35 ఏళ్ల ప‌విత్ర‌ హైదరాబాద్‌లో కర్నూలు సమీపంలో తెల్లవారుజామున ప్రమాదానికి గుర‌య్యార‌ని తెలిసింది. సహాయక పాత్రలలో నటించడం నుండి రోజువారీ సీరియ‌ళ్ల‌లో ప్రధాన పాత్రలలో నటించడం వరకు పవిత్ర జయరామ్ అంచెలంచెలుగా ఎదిగారు.