ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సరికొత్త జోనర్.. గుప్త నిధుల వేట!

మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ మొదటి నుంచి కూడా కమర్షియల్ కాన్సెప్ట్ లోనే ఫ్యామిలీ కథలను ఎక్కువగా రాస్తున్నారు. ఇక మొదటిసారి ఆయన తారక్ కోసం తన స్టైల్ ని పూర్తిగా మార్చనున్నట్లు తెలుస్తోంది. RRR తరువాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమాను త్రివిక్రమ్ కొత్త తరహాలో తెరకెక్కించనున్నాడాట. గుప్త నిధుల కోసం వెళ్లే హీరోగా తారక్ కనిపించబోతున్నాడట. మిస్టరీ, థ్రిల్లర్ అంశాలు గట్టిగానే ఉంటాయట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఏండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచే ఒక స్టార్ బ్యూటీని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.