మణిరత్నం పాన్ ఇండియా సినిమాకు రెడీ

టాప్ డైరెక్టర్ మణిరత్నం పాన్ ఇండియా సినిమాకు సంబంధించి వచ్చిన ఒక అప్డేట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన డైరెక్షన్‌లో రానున్న పాన్ ఇండియా సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా షూటింగ్ గత సంవత్సరం థాయ్‌లాండ్‌లో ప్రారంభం అవ్వగా.. జనవరిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావం పెరగడం, లాక్‌డౌన్ మొదలు కావడంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు.

mani ratnam

అయితే త్వరలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. పొల్లాచి మైసూర్‌లో దీని షూటింగ్ ప్రాంభించనున్నారు. ఆ తర్వాత శ్రీలంకలో షూటింగ్ చేయనున్నారు. పురాణేతిహాస నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఇందుల్ పెద్ద పెద్ద స్టార్లు నటిస్తున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది.

ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష, జయరామ్, ఆధీ, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లక్ష్మి లాంటి పెద్ద పెద్ద సార్లు కీలక పాత్రలలో నీటించనున్నారు. టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు వర్క్ చేయునున్నారు. ఇందులో ఐశ్వర్యారామ్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించనుందని సమాచారం. మణిరత్నంకు తమిళం, తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆయన తీసిన సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆయన తీస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.