లాక్ డౌన్ లో కూడా జోరు పెంచుతున్న మహేష్.. రిలయన్స్ తో డీలింగ్స్!

mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కంటే కూడా ఒక విధంగా యాడ్స్ ద్వారానే తన ఆదాయాన్ని ఎక్కువగా పెంచుకుంటున్నాడు. లాక్ డౌన్ లో సినిమా షూటింగ్స్ లేకపోయినా కూడా మహేష్ ఆదాయం ఏ మాత్రం తగ్గలేదు. నమ్రత ప్రణాళికలతో యాడ్స్ తో బిజీ అవుతున్నాడు. ఇటీవల రిలయన్స్ కంపెనీతో కూడా సూపర్ స్టార్ ఒక డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

జియో కోసం తెలుగు రాష్ట్రాల్లో మహేష్ ప్రచార కర్తగా బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం భారీ స్థాయిలో పేమెంట్స్ అందుకున్నాడట. త్వరలో జియో OTT ఫ్లాట్ ఫార్మ్ లో బిజీ కానుంది. ఈ సందర్భంగా మహేష్ ఆ కంపెనీతో వెబ్ సిరీస్ వంటి ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులను నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో OTTల హవా ఎక్కువ కానుందని మహేష్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే జియో టీవీతో చేతులు కలిపినట్లు సమాచారం.